Friday, May 17, 2024

24 గంటల్లో 475 మందికి కరోనా పాజిటివ్‌

spot_img

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు బయటపడ్డాయి.

Also Read.. హోటల్లో కొడుకును చంపి బ్యాగులో కుక్కి శవంతో ప్రయాణించిన తల్లి

దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల దిగువకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో 3,919 కేసులు యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా..నిన్న ఒక్కరోజే ఆరుగురు మరణించారు. కర్ణాటకలో ముగ్గురు, చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Latest News

More Articles