Sunday, May 19, 2024

షాపింగ్‌కు వెళ్లి వచ్చేసరికి.. 35 తులాల బంగారం చోరీ

spot_img

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లోని డీడీ కాలనీలో నసీర్ హైమద్ అనే సివిల్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారంతో పాటు 1.5 లక్షల రూపాయలు నగదును దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులతో కలసి హైమద్ గురువారం షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు.

Also Read.. విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు

షాపింగ్ నుంచి తిరిగొచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని  బీరువాలో ఉన్న బంగారం తోపాటు నగదు కనిపించలేదు. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఆధారాలను సేకరించారు. ఇంటి ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles