Saturday, May 18, 2024

బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం

spot_img

మహాఘట్‌బంధన్‌ను వీడి… ఎన్డీయేలో చేరిన బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇవాళ(సోమవారం) ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ… నితీశ్ కుమార్ ఎన్డీయేలో చేరాలని ఎందుకు అనుకున్నారో తనకు తెలియడం లేదన్నారు. ఓవైపు ఇన్నాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన జేడీయూ అధినేత… హఠాత్తుగా ఎందుకు తన మనసును మార్చుకున్నారో అర్థం కావడం లేదన్నారు. నితీశ్ కుమార్‌కు భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఇంత తక్కువ సమయంలో… రోజుల వ్యవధిలో ఓ నేతలో ఇలాంటి మార్పును ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని విమర్శించారు శరద్ పవార్.

బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలు గతంలో పాట్నాలో సమావేశమయ్యాయని… నితీశ్ కుమార్ వారిని ఆహ్వానించారని గుర్తు చేశారు. కానీ గత పది, పదిహేను రోజులుగా ఆయనలో మార్పు కనిపిస్తోందని… కూటమి సిద్ధాంతాన్ని పక్కన పెట్టారని ఫైర్ అయ్యారు. I.N.D.I.A. కూటమిలో నితీశ్ కుమార్ పాత్ర కీలకమన్నారు. ఆయన సిద్ధాంతాన్ని వదిలి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదన్నారు.

ఇది కూడా చదవండి: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయం

Latest News

More Articles