Sunday, May 12, 2024

జీహెచ్ఎంసీ కమిషనర్‌పై హైకోర్టులో కార్పొరేటర్ పిటిషన్

spot_img

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ పై మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జీహెచ్ఎంసీ సర్వ సభ సమావేశాన్ని నిర్వహించాలని పిటిషన్ లో కోరారు. ఎన్నికల కోడ్ ఉన్నందున నవంబర్ లో కౌన్సిల్ నిర్వహించలేదని తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటివరకు స్టాండింగ్ కమిటీకి కమిషనర్ ఎన్నికలు నిర్వహింలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బడ్జెట్ ను స్టాండింగ్ కమిటీ ఆమోదిస్తేనే కౌన్సిల్ ను నిర్వహించాల్సి ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు.

Also Read.. మేడారం జాతర. పర్యావరణ రుసుము నిలిపివేత

Latest News

More Articles