Sunday, May 19, 2024

కొమురవెల్లి మల్లన్నసేవలో ఎమ్మెల్యే తలసాని

spot_img

హైదరాబాద్‌ : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో ఆదివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తెల్లవారుజామునుంచే కోనేరులో స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకుని ముడుపులు చెల్లించుకున్నారు.  మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Also Read.. బీజేపీలో చేరాల‌ని త‌న‌పై ఒత్తిడి చేస్తున్నారు.. కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు..!

Latest News

More Articles