Saturday, May 11, 2024

సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

spot_img

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోడీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ ఇవాళ(మంగళవారం) ఉదయం సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షణ చేసిన మోడీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి శేష వస్త్రంతోపాటు చిత్రపటాన్ని అందించారు.

ఇది కూడా చదవండి: దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఎ సోదాలు

 

 

 

Latest News

More Articles