రంగారెడ్డి: మైలార్ దేవ్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పతంగులు ఎగురవేస్తూ 9 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు బిల్డింగ్ పై పతంగులు ఎగురవేస్తుండగా.. మాంజా కరెంటు తీగలకు తగలడంతో షాక్ తగిలింది. దీంతో బాలుడు స్పాట్ లో కుప్పకూలాడు.
Also Read.. మంత్రి జూపల్లివి పచ్చి అబద్ధాలు, కట్టుకథలు
బాలుడి కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పతంగులు ఎగురవేస్తూ ప్రమాదానికి గురై మరణించిన వారి సంఖ్య 10కి చేరుకుందని పోలీసులు తెలిపారు.