Sunday, May 5, 2024

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ధోనీ, కోహ్లీకి ఆహ్వానం

spot_img

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అత్యంత  ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు. దాదాపు 6వేల మంది పైగా ప్రత్యేక అతిథుల సమక్షంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను కూడా ఆహ్వానించారు. ధోనీ, కోహ్లీలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

ఇది కూడా చదవండి:  హైదరాబాద్ టీకా కోర్బీవ్యాక్స్ కు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి

Latest News

More Articles