Saturday, May 18, 2024

రన్‌వేపై ప్రయాణికుల భోజనం. ఇండిగోకు నోటీసులు

spot_img

ముంబై: కొందరు ప్రయాణికులు విమానం పక్కన రన్‌వేపై కూర్చుని భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అయింది. దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఇండిగో, ముంబై ఎయిర్‌ పోర్టులకు  నోటీసులు జారీ చేసింది.

Also Read.. విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్‌!

ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఇండిగో, ముంబై ఎయిర్‌ పోర్టు విఫలం అయినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మరోవైపు ఉత్తరాదిన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.  దీంతో విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి.

Also Read.. వాహనదారులకు ఫ్రీగా గ్యాస్ కొట్టించిన క్రికెటర్

ఇదిలా ఉండగా.. గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబై ఎయిర్‌ఫోర్ట్‌కు వచ్చింది. అప్పటికే బాగా ఆలస్యం కావడంతో కొందరు ప్రయాణికులు కిందకి దిగి అక్కడే నేలపై కూర్చొని భోజనం చేయడం వివాదస్పదం అయింది.

Latest News

More Articles