న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు రిఫర్ చేస్తున్నట్లు వారు తెలిపారు.
Also Read.. పంజాబ్ సీఎంను చంపుతామంటూ గ్యాంగ్స్టర్ హెచ్చరిక
చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని, సీఐడీ తగిన అనుమతి తీసుకుని ఉండాల్సిందని జస్టిస్ అనిరుద్ధబోస్ అభిప్రాయపడ్డారు. అయితే, 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం. త్రివేది అన్నారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే.. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు.