Wednesday, May 8, 2024

మా ఊళ్లో ప్రచారం వద్దు.. కాంగ్రెస్‌ ఫ్లెక్సీని చింపేసిన చిలుకమ్మతండా వాసులు

spot_img

మా ఊరికి కాంగ్రెస్‌ ప్రచార రథం రావద్దంటూ స్థానికులు అడ్డుకొన్నారు. ప్రచార ఆటోకు ఉన్న ఫ్లెక్సీలను చింపివేశారు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా సంగెం మండలం ఎల్గూర్‌ స్టేషన్‌ చిలుక మ్మతండాలో శుక్రవారం జరిగింది.

వరంగల్‌ జిల్లా ఖిలావరంగ ల్‌ మండలం వసంతాపురం గ్రామానికి చెందిన గుండె కారి జైపాల్‌ తన ఆటోను కాంగ్రెస్‌ ప్రచారం కోసం పెట్టాడు. ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్గూర్‌స్టేషన్‌ చిలుకమ్మతండాకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రచార వాహనాన్ని ఆపి భోజనం చేస్తుండగా అదే తండాకు చెందిన గుగులోత్‌ శంకర్‌, బానోత్‌ రాజు వచ్చి ప్రచార ఆటోకు ఉన్న ఫ్లెక్సీని చించివేశారు. ఎందుకు చించుతు న్నారని అడిగితే కాంగ్రెస్‌ బండి ఇక్కడ తిరుగొద్దని డ్రైవర్‌ను బెదిరించారు. డ్రైవర్‌ జైపాల్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: గులాబీ జెండా గులాంగిరీని అంతం చేసి తెలంగాణను తెచ్చింది

Latest News

More Articles