పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ను చంపుతానంటూ ఓ ఉగ్రవాది పిలుపునిచ్చాడు. సీఎంతో పాటు డీజీపీ గౌరవ్ యాదవ్లను చంపేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ వ్యాఖ్యానించాడు. గణతంత్ర దినోత్సవం రోజున సీఎంపై దాడి చేసేందుకు గ్యాంగ్స్టర్లు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చాడు. గ్యాంగ్స్టర్లకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు వచ్చాయి. భారత్లోని ప్రఖ్యాత ప్రాంతాలపై దాడులు చేస్తామంటూ ఇటీవల తరచూ పన్నూ బెదిరింపులకు దిగుతున్నాడు. వీటిని తీవ్రంగా పరిగణిస్తోన్న కేంద్రం.. ఎప్పటికప్పుడు భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. కాగా, సిక్స్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. దాని వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడిగా ఉన్నాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.