ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజు నిన్న(సోమవారం)నే ఆ పదవికి రాజీనామా చేశారు. అయన స్థానంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ఇక గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.
ఇది కూడా చదవండి: దట్టమైన పొగమంచుతో ఢిల్లీలో విమాన సర్వీసులకు అంతరాయం