ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉంది. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి. 30 విమానాలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. 17 విమానాలు రద్దు అయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దు కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: ఓఆర్ఆర్ పక్కన మూటలో కుళ్లిన మృతదేహం