సూర్యాపేట జిల్లా: చేతిలో టపాసులు పేలి ఓ యువకుడు కుడి చెయ్యి నుజ్జు నుజ్జు అయింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టారు. కాగా, అవిశ్వాసంకు మున్సిపల్ చైర్మన్ గైర్హాజరు అయ్యారు. చైర్మన్ తొలిగించే అంశంలో కాంగ్రెస్ కౌన్సిలర్స్ విజయం సాధించారు.
Also Read.. ఉప్పల్ స్టేడియంలో టీమిండియా నెట్స్ ప్రాక్టీస్
ఈ సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు. అందులో భాగంగా ఓ యువకుడు చేతిలో రెండు టపాసులు పట్టుకొని ఉండగా.. కొన్ని నిప్పు రవ్వలు చేతిలో ఉన్న టపాసులకు అంటుకొని అవి పేలాయి. దీంతో ఆ యువకుడి చెయ్యి నుజ్జు నుజ్జు అయింది. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.