Friday, May 17, 2024

టీమిండియాకు ‘సెలక్టర్‌’ కావలెను. బీసీసీఐ ప్రకటన

spot_img

ముంబై: అజిత్‌ అగార్కర్‌ సారథ్యంలోని మెన్స్‌ సెలక్షన్‌ కమిటీలో ఒక సెలక్టర్‌ పదవిని భర్తీ చేయనున్నారు. ఇందు కోసం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సెలక్షన్‌ కమిటీలో ఐదుగురు సభ్యులుండగా.. అజిత్‌ అగార్కర్‌ చీఫ్‌ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read.. ఒక్కడే 400 కొట్టాడు.. యువ బ్యాటర్‌ సంచలన ఇన్నింగ్స్‌

ప్రస్తుతం శివ సుందర్‌ దాస్ (ఈస్ట్‌ జోన్‌)‌, సుబ్రతో బెనర్జీ (సెంట్రల్‌ జోన్‌), సలిల్‌ అంకోలా (వెస్ట్‌ జోన్‌), శ్రీధరన్‌ శ్రీరామ్‌ (సౌత్‌ జోన్‌) లు సభ్యులుగా ఉన్నారు. ఒక్క జోన్‌ నుంచి ఒక్క సెలక్టర్‌ మాత్రమే ఉండాలన్న నిబంధన నేపథ్యంలో అంకోలా తన పదవి నుంచి వైదొలగనున్నాడు. చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న అజిత్‌ అగార్కర్‌ సైతం వెస్ట్‌ జోన్‌ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Also Read.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు.. ఐఎంఎఫ్ చీఫ్‌ క్రిస్టలినా

నార్త్‌ జోన్‌ నుంచి సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ తన ప్రకటనలో వెల్లడించింది. భారత్‌ తరఫున కనీసం ఏడు టెస్టులు లేదా దేశవాళీలో 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన వారు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరింది.

Latest News

More Articles