లోకసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో అభ్యర్థుల అన్వేషణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే బీజేపీ తన ఐదవ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 111 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ సారి బీజేపీ చాలా మంది కొత్తవాళ్లకు టిక్కెట్లు ఇచ్చింది. ఇందులో ఎక్కువగా యువనేతలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈసారి లోకసభ ఎన్నికల్లో కొంతమంది సినీనటులకు కూడా టిక్కెట్లుదక్కాయి.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈసారి బీజేపీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకుంది. తొలి నాలుగు జాబితాల్లో ఈమే పేరు లేదు. ఐదవ జాబితాలో ఈ నటికి ఛాన్స్ లభించింది. మరి కంగనా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా ?
కంగనా రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అని చెప్పింది. బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు నడ్డా ప్రకటించారు. ఐదవ జాబితాలో కంగనా పేరు రావడంతో అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ఆమె జన్మస్థలం మండి నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచిన రనౌత్.. బీజేపీలో చేరడం గౌరవంగా భావిస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. రనౌత్ (37) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు, “నా ప్రియమైన భారతదేశం భారతీయ జనతా పార్టీ స్వంత పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎల్లప్పుడూ నా బేషరతు మద్దతును అందుకుంటుంది. ఈ రోజు బిజెపి జాతీయ నాయకత్వం నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్లో నన్ను అభినందించింది.” , నన్ను మండి (నియోజకవర్గం) నుంచి నా లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీలో అధికారికంగా చేరినందుకు గౌరవంగానూ, ఉత్సాహంగానూ ఉన్నాను. నేను సమర్థుడైన ‘కార్యకర్త’నమ్మకమైన ప్రజా సేవకుడిగా మారాలని ఎదురుచూస్తున్నాను. అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
View this post on Instagram
కాగా కంగనాతోపాటు రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన ‘రామాయణం’లో శ్రీరాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ను మీరట్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ పోటీకి దింపింది. ఇటీవల గోవిల్, నేపథ్య గాయని అనురాధ పౌడ్వాల్ బీజేపీలో చేరారు. జనవరిలో అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో జరిగిన రామ్ లల్లాకు పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులలో రనౌత్, గోవిల్, పౌడ్వాల్ ఉన్నారు.