Saturday, May 11, 2024

కేసీఆర్ కోసం దేశం చూస్తోంది.. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు

spot_img

అదిలాబాద్ జిల్లా:  ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి సమర్ధవంతమైన నాయకుడు దేశానికి ఎంతో అవసరం అని బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కన్వీనర్, నాందేడ్  మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొండ్గే అన్నారు. గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలిపారని కొనియాడారు. కేవలం పదేళ్ళ కాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శవంతంగా నిలిచిందని ప్రశంసలు కురిపించారు. అదిలాబాద్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read.. కాంగ్రెస్ పని అయిపోయింది.. బిజెపికి క్యాడర్ లేదు

‘‘కాంగ్రెస్, బీజేపీలు పాలించిన మహారాష్ట్రలో దయనీయ పరిస్థితులు ఉన్నాయి. కనీస వసతుల కల్పనలో అక్కడి ప్రభుత్వాలు విఫలమయ్యాయి. తెలంగాణ వైపు యావత్ దేశం చూస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి సమర్ధవంతమైన నాయకుడి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్, బీజేపీలు విస్మరించాయి.

Also Read.. బీజేపీకి మ‌తమే ప్ర‌ధాన ఎజెండా

కాంగ్రెస్ , బిజెపి పార్టీలు అన్నదాతలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చలేదు. మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యం. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. తెలంగాణలో ఉన్న మహారాష్ట్ర వాసులు సైతం టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మహారాష్ట్రలో సైతం అక్కడి ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నే కోరుకుంటున్నారు.’’ అని శంకరన్న దొండ్గే అన్నారు.

Latest News

More Articles