Sunday, May 19, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ.. నిబద్ధత కలిగిన నేతగా చరిత్రలో నిలిచారు

spot_img

హైదరాబాద్: తాను నమ్మిన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ బడుగు బలహీన వర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 108 వ జయంతి (సెప్టెంబర్ 27 ) సందర్భంగా, వారు తెలంగాణ కు అందించిన సేవలను, చేసిన త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

Also Read.. గణపతి నిమజ్జనం.. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

దేశ స్వాతంత్ర్యోద్యమంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసిందని సీఎం అన్నారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించిన బాపూజీ, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యజించి నిబద్ధత కలిగిన నేతగా చరిత్రలో నిలిచారని సీఎం అన్నారు.

Also Read.. మీరు ఫిట్టా.. గవర్నర్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

బాపూజీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణ ద్వారా నెరవేరుస్తున్నదని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం స్పష్టం చేశారు.వారి స్మారకార్థం పలు కార్యక్రమాలు చేపట్టామని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి యేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ ఆయనకు నివాళి అర్పిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానమే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని సీఎం అన్నారు.

Latest News

More Articles