మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ కార్యలయంలో ఏసీబీ దాడులు చేసింది. 65 వేలు లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సీఐ రెడ్ హ్యాండెండ్ గా దొరికారు. భూత్ పూర్ కి చెందిన ఓ వ్యక్తి లైసెన్స్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానిని మార్పు చేసేందుకు ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు ఇచ్చిన సూచనల మేరకు బాధితుడు సీఐకు లంచం అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Also Read.. ఓటుకు నోటు ఎమ్మెల్సీ అభ్యర్థికి కేబినెట్ ర్యాంక్ ఏంటీ ?