Tuesday, May 7, 2024

పాక్‌ క్రికెట్‌కు కొత్త చీఫ్‌.. ఫ్యాన్స్‌ ఆందోళన!

spot_img

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కి మోహ్సిన్‌ నఖ్వీ కొత్త చీఫ్‌ గా రాబోతున్నాడు. పాక్‌ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో జకా అష్రఫ్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి మోహ్సిన్‌ కేర్‌టేకర్‌ సీఎంగా ఉన్నారు.

Also Read.. రామమందిరం వద్ద డాన్స్ అదరగొట్టిన కంగనా.. వీడియో వైరల్..!

‘పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఉన్న సమస్యలను నేను పరిష్కరించేందుకు కృషి చేస్తా.’ అని నఖ్వీ ట్వీట్ చేశారు.  దీంతో అతడి అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నపీసీబీ చీఫ్‌గా నఖ్వీని చేయడంపై పాకిస్తాన్‌ మాజీ క్రికెట్‌ లతోపాటు అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. పీసీబీని అతడి చేతుల్లోకి వెళితే.. రాబోయే రోజుల్లో పాకిస్తాన్‌ క్రికెట్‌ నిషేధం ఎదుర్కోవడం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

 

Latest News

More Articles