మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం న్యూ టౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మాజీ చైర్మన్ లు ఇంతియాజ్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్ లో మాట్లాడలేరు. వాళ్లకు రాష్ట్రానికో ఎజెండా ఉంటుంది. ఒక దాని గురించి మాట్లాడితే మరొకరికి కోపం వస్తుంది. మనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల కాళ్ళు మొక్కుతున్నారు. అటువంటి వారు మన రాష్ట్ర హక్కులను ఎలా సాధిస్తారు. కార్యకర్తలు కస్టపడి పని చేసి ఎంపీ ఎన్నికల్లో పార్టీకి విజయం అందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమికి భయపడే కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు.
Also Read.. నారా భువనేశ్వరికి తృటిలో తప్పిన పెను ప్రమాదం