మెదక్ జిల్లా వెల్దుర్ది మండలంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కూలిపోయింది. దీంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉప్పు లింగాపూర్ గ్రామంలో ఇవాళ(శుక్రవారం) సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల వీరమని ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో.. ఇంటి పక్కన ఉంటున్న కుంట్ల పాండు ద్వారా వెల్దుర్తి లోని ఇండియన్ గ్యాస్ గోదాం నుండి గ్యాస్ సిలిండర్ తెప్పించింది.
సిలిండర్ అమర్చి వెలిగిస్తున్న క్రమంలో గ్యాస్ లీకేజీ అయి భారీ శబ్దం రావడంతో వడ్ల వీరమణి నివసిస్తున్న ఇల్లు కూలింది. ఇంటి పక్కన నివసిస్తున్న వరలక్ష్మీ, శ్యామల, కుంట్ల పాండు, వడ్ల వీరమణికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గ్రామస్తులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని తొమ్మిదేళ్లలోనే చేశాం