న్యూఢిల్లీ: మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్కు వెళుతున్న లుఫ్తాన్సా ఎయిర్లైన్స్కు చెందిన LH772 విమానంలో భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో ఆ విమానాన్ని ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జర్మన్ వ్యక్తి అతని థాయ్ భార్య మధ్య వివాదం తలెత్తింది.
Also Read.. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి
ఈ క్రమంలో తన భర్తపై థాయ్ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం భర్తని ఫ్లైట్ నుంచి దింపి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి అప్పగించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఆ తర్వాత విమానం బ్యాంకాక్కు బయలుదేరి వెళ్లింది.