హైదరాబాద్ : శంషాబాద్ ప్రాంతంలోని గగన్పహాడ్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా అస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. కంపెనీ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలోని గగన్పహాడ్ పారిశ్రామిక వాడలోని రంగోలి ఈపీఎస్ థర్మకోల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది.
కంపెనీలో కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్సర్క్యూట్తో మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు అప్రమత్తం అయి ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్ సిలిండర్లను బయటకు తరలించారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.