Saturday, May 4, 2024

నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది

spot_img

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఅర్ఎస్ ప్రభుత్వమే. మనం పదేళ్లు పాలించినం..వాళ్లు వచ్చి నాలుగు నెలలు కాలేదు. ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత పెరిగిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితదన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలపై ఇవాళ( శుక్రవారం) కొండ భూదేవి గార్డెన్‌లో సిద్దిపేట పట్టణ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొని మాట్లాడారు హరీశ్ రావు.

సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి సీఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు తరలించుకు పోయాడని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదని విమర్శించారు. బీజేపీ పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ.

సిలేరును లాక్కుని మనకు అన్యాయం చేసిన పార్టీ అని గుర్తు చేశారు. పదేళ్లలో బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురదజచ ల్లిండ్లు.. ఇప్పుడు మోడీని బడేమియా అంటుంటున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగాణలో బీఅర్ఎస్ లేకుండా చేయాలనే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందని ముస్లిం సోదరులు గుర్తించాలి. ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు.

గులాబీ జెండా ప్రాణం పోసింది సిద్దిపేట. సిద్దిపేట కు అన్యాయం జరిగితే… అక్కసు వెళ్ళగట్టితే ఉరుకుందామా అని ప్రశ్నించారు. సిద్దిపేట ప్రజలుగా చీము నెత్తురు ఉన్నోళ్ళం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేసి మోస పోదామా అని అన్నారు. సిద్దిపేట లో వివిధ అభివృద్ధి పనులు, రోడ్లు కు 150 కోట్లు రద్దు చేసిండు. అలాంటి వారికి సిద్దిపేట లో ఓట్లు ఎట్లా వేస్తాం. సిద్దిపేట అంటే ప్రత్యేకత, గౌరవం ఉంది. ఆ ప్రత్యేకతను మరో సారి చాటుకుందామన్నారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: ఫూలే, అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను కొన‌సాగిస్తున్న‌ది కేసీఆర్ మాత్ర‌మే

Latest News

More Articles