Friday, May 17, 2024

తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‎కు ఓటు వేయాలి

spot_img

ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామంలోని చెరుకు బాలయ్య గార్డెన్‎లో మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ప్రజాప్రతినిధలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

Read Also: పార్టీ పేరును ప్రకటించిన హీరో విజయ్.. అసెంబ్లీ బరిలోకి దిగుతాం

‘కేంద్రంలో మేం అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలి. కృష్ణా గోదావరి జీవ నదులు. కృష్ణాలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదు. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను తాకట్టు పెట్టారు. మల్లారెడ్డితో పోటీ పడే పరిస్థితి ఎవరికీ లేదు. ప్రజల కోసం పని చేసే నాయకుడు మల్లారెడ్డి. 420 హామిలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి. మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. 2 లక్షలు లోన్ తీసుకోమన్నారు, నేను మాఫీ చేస్తా అన్నారు.. ఎటుపోయింది? కోటి 57 లక్షల మంది ఆడ బిడ్డలు రూ. 2500 కోసం వేచి చూస్తున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల కడుపుకొట్టారు. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, 420 హామీలు తర్వాత అమలు చేస్తా అన్నారు. రేవంత్ లాంటి వాళ్ళను చాలా మందిని చూశాం. ఎంతో మంది తీస్మార్ ఖాన్‎లను మాయం చేసి తెలంగాణా తెచ్చారు కేసీఆర్. ఎవరికి అన్యాయం జరిగినా అందరం బస్ వేసుకొని వస్తాం. మన బాస్‎లు ఢిల్లీ, గుజరాత్‎లో లేరు. తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‎కు ఓటు వేయాలి. ప్రశ్నించే గొంతుక అని రేవంత్ మల్కాజ్ గిరి ఎంపీ అయ్యారు. లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారు. సెక్రటేరియట్‎లో కంప్యూటర్లు, పేపర్లు ఉంటాయి.. లంకె బిందెలు ఉండవు. ప్రజల తరుపున పోరాడుతాం, ప్రతి హామీని వారు నెరవేర్చే వరకు పోరాడుతాం. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా గులాబీ జెండాకు ఓటు వేస్తేనే మన గొంతుక ఉంటది’ అని కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles