Wednesday, May 8, 2024

కాంగ్రెస్ నిజస్వరూపం మళ్ళీ బయటపడింది

spot_img

ప్రజలను మోసం ఎలా చేయాలో అనే అంశంలో కాంగ్రెస్ ఆరితేరిన పార్టీ. ఇచ్చిన వాగ్దానాలని గాలికొదిలేయటంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

తాజాగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికల వాగ్దానంలో భాగంగా.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువత కోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని.. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటిపేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా.. మరి నిన్ననే ఒకటో తేది. ఇది ఫిబ్రవరి నెలే. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయింది. మరి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదు’ అని కేంద్రమంత్రి గుర్తు చేశారు.

కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువత కోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, నిన్న నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు సంధించారు. ఇచ్చిన హామీలు ఎగరగొడుతూ నిత్యం ప్రజలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ దేనని విమర్శలు గుప్పించారు.

Latest News

More Articles