Friday, May 3, 2024

 సివిల్స్ లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటడం గర్వంగా ఉంది

spot_img

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నా అని అన్నారు కేటీఆర్. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు.వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం చాలా సంతోషానిస్తోంది. వందలోపు నాలుగు ర్యాంకులు సాధించిన తెలంగాణ బిడ్డలు దోనూరు అనన్య రెడ్డి, నందాల సాయికిరణ్, కేఎన్ చందన జాహ్నవి, మెరుగు కౌశిక్ లకు, వారి తల్లితండ్రులకు శుభాభినందనలు.  సివిల్స్  పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి  60 మంది ఎంపిక కావటమనేది ఎంతో ఆనందాన్నిచ్చే వార్త.  ప్రతిష్టాత్మక సివిల్స్ లో కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి  మన  విద్యార్థులు సత్తా చాటుతుండటం గర్వంగా ఉంది. సివిల్స్ సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి దేశ భవిష్యత్  నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నా అంటూ ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు కేటీఆర్.

Latest News

More Articles