Saturday, May 18, 2024

పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం

spot_img

పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తొర్రూరు మండలంలోని కంటాయపాలెం మాజీ సర్పంచ్ పల్లె సర్వయ్య, జాటోత్ భాస్కర్ ఆధ్వర్యంలో హరిపిరాల, దుబ్బ తండా, మంగళి సాయి తండాకు చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు.. కొడకండ్ల మండలం, రామవరం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్, ప్రశాంత్ యాదవ్‎ల అధ్వర్యంలో 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read Also: ఐ ఫోన్ కంపెనీకి షాక్.. ఐ ఫోన్ వాడకాన్ని నిషేధించిన చైనా

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామన్నారు. పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి శాయ శక్తుల కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Latest News

More Articles