Friday, May 3, 2024

మా జాతిని కించపరిస్తే అణగతొక్కేస్తాం.. రేవంత్ కి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

spot_img

రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, కార్పొరేషన్ చైర్మన్ లు పల్లె రవి,ఆంజనేయులు గౌడ్,పలువురు ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘గతంలో సర్వాయి పాపన్న వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహించాలి అంటే అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. బీసీలు ఎదుగుతుంటే అణిచి వేసే కుట్రలు ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఉన్న ముగ్గురు బీసీ మంత్రులపై కోవర్టు ఆపరేషన్స్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు. మా వృత్తుల పట్ల అవహేళన చేసిన వారిని వదిలిపెట్టము. మా జాతులను కించ పరిచే విదంగా మాట్లాడితే రాజకీయంగా అణగతొక్కుతాం’ అని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Latest News

More Articles