Friday, May 17, 2024

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ రోజున ఢిల్లీలో మ‌ద్యం అమ్మ‌కాలు బంద్ !

spot_img

ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య రేపు(ఆదివారం) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. దీంతో రేపు ఢిల్లీలో మ‌ద్యం షాపులను బంద్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆదివారం ఎటువంటి మ‌ద్యం సేల్స్ ఉండ‌వు. మ‌ద్యం అమ్మ‌కాల‌కు .. క్రికెట్‌కు ఎటువంటి లింకు లేదు. కానీ, ఛాత్‌ పూజ‌ కారణంగా ఢిల్లీలో మ‌ద్యం సేల్స్ ఉండ‌వ‌ని ఎక్సైజ్ క‌మీష‌న్ తెలిపింది. దీనికి సంబంధించి క‌మిష‌న‌ర్ కృష్ణ మోహ‌న్ ఉప్పు ఆదేశాల‌ను జారీ చేశారు. ఛాత్ పూజ పండ‌గ ఉన్న కార‌ణంగా ఆదివారం మ‌ద్యం షాపుల‌ను మూసివేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఛాత్‌ పూజ‌ను ఘ‌నంగా నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుక జ‌రుగుతుంది. మార్చి 8 హోలీ, అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి, అక్టోబ‌ర్ 24 ద‌స‌రా, న‌వంబ‌ర్ 12 దివాళీ పండుగ‌ల వేళ కూడా న‌గ‌రంలోని 637 మ‌ద్యం షాపుల‌ను మూసివేశారు. అంతేకాదు డిసెంబ‌ర్ 25వ తేదీన క్రిస్మ‌స్ సంద‌ర్భంగా మ‌ద్యం దుకాణాల‌ను మూసివేస్తారు.

ఇది కూడా చదవండి: మనకు కాంగ్రెస్ కావాలా, కరెంట్ కావాలా ఆలోచించాలి

 

Latest News

More Articles