Thursday, May 2, 2024

మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌పై పిటిషన్‌.. కొట్టేసిన హైకోర్టు

spot_img

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ అంజిరెడ్డి అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, అఫిడవిట్‌లో అభ్యంతరాలపై ఇప్పటికే సమాధానమిచ్చినట్లు ఎన్నికల కమిషన్‌ కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Latest News

More Articles