కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఆటో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి సబ్బిడి నర్సింలు(53)గా తెలిపారు.
గాయపడిన వారిని బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నర్సింలుకు ఒక్క కుమార్తె. కాగా కూతురు బర్త్ డే సందర్భంగా తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం ను దర్శించుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చదవండి: పదవికి రాజీనామా చేసిన పంజాబ్ గవర్నర్