వివాదాలతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మోడల్, బోల్డ్ నటి పూనమ్ పాండే పోలీసులు కేసు నమోదు చేశారు. తాను చనిపోయానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి…పిచ్చిపనిచేసిన పూనమ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. తాను గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ తో మరణించానంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టించి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. మరుసటి రోజు అది ఫేక్ తేలింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికే ఇలా చేశానంటూ పూనమ్ తెలిపింది. అయితేతాజాగా పూనమ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కొంతమంది.
@MumbaiPolice @CPMumbaiPolice @DGPMaharashtra pls investigate & register FIR against all responsible for spreading FAKE news about @iPoonampandey‘s “death” u/s concerning public mischief, IT Act, etc. Such trend of “fake shocking news” must be dealth strictly @Devendra_Office
— Flynn Remedios (@FlynnRemedios) February 2, 2024
ఓ జర్నలిస్టు ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణంపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని..ఇలాంటిఫేక్ న్యూస్ ను అరికట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా పూనమ్ చర్యను తీవ్రంగాఖండించారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు పూనమ్ ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ…మరణం గురించి తప్పుడు వార్తలను పుట్టించడం సరిగ్గా లేదని విమర్శిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఇదేం రోగమంటూ కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ అలవాట్లు క్యాన్సర్కు దారితీస్తాయి..వెంటనే వాటిని వదిలించుకోండి..!!