Sunday, May 19, 2024

కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొడతాం

spot_img

పెద్దపల్లి జిల్లా: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని, ఎక్కడా కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టినా అది వీగి పోతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి అధ్యక్షుడు కోరు కంటి చందర్ అన్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, జెడ్పీటీసీలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.

Also Read.. దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి

ఈసందర్భంగా కోరు కంటి చందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని అన్నారు. జెడ్పీటీసీలు, ఎంపిపిలు, మున్సిపల్ చైర్మన్ లపై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రలోభాలకు లొంగరని అన్నారు.

Also Read.. పతంగులు ఎగురవేస్తూ 9 ఏళ్ల బాలుడు మృతి

కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అందరూ మాతోనే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మోద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంటర్ఘం జెడ్పీటీసీ ఆముల నారాయణ, ఓదెల జడ్పీటీసీ గంట రాములు, ధర్మారం జడ్పీటీసీ పుస్కురి పద్మజ,  ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Latest News

More Articles