రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నివాసం ఉండే వినయ్, తన భార్య తల నరికి కిరాతకంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read.. దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి