Friday, May 17, 2024

ప్రియాంక గాంధీ సభలు అట్టర్ ప్లాప్!

spot_img

సిద్దిపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలు అట్టర్ ప్లాప్ అయ్యింది. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కి మద్దతుగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ చేపట్టిన ప్రచారంకు ప్రజలు ఆసక్తి చూపలేదు. చాలామంది ఆమె రాకముందే సభా స్థలి నుండి వెళ్లి పోయారు. సభ దాదాపు ఖాళీ అయ్యింది. కేవలం కుర్చీల్లో కూర్చున్న కొద్ది మంది మాత్రమే సభలో ఉన్నారు. ఒకవైపు ఆమె మాట్లాడుతుండగానే ప్రజలు వెళ్లిపోవడం కనిపించింది.

Also Read.. డ‌బ్బుతో వెళుతున్న కారులో మంట‌లు… అందిన‌కాడికి దోచుకున్న జ‌నం

అదే విధంగా మహబూబాబాద్ పాలకుర్తి ప్రియాంకా గాంధీ సభ కూడా అట్టర్ ప్లాప్ అయింది. సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ప్రియాంకా గాంధీ మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు. కాంగ్రెస్ నేతలు బతిమిలాడిన ప్రజలు వెనుదిరగడం కనిపించింది.

Latest News

More Articles