Monday, May 6, 2024

రిస్క్ వద్దు కారుకు ఓటు గుద్దు…కర్నాటక కష్టాలు మనకు వద్దు

spot_img

నిన్న మూడు గంటల కరెంట్ చాలన్న ఆయన నారాయణఖేడ్ వచ్చాడని..రాహుల గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక లో 5 గ్యారెంటీలు అంటున్నారని అన్నారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ బీఅర్ఎస్ అభ్యర్ధి భూపాల్ రెడ్డి కి మద్దతుగా రోడ్డు షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..కర్ణాటక లో కాంగ్రెస్ కి ఓటేసినందుకు రైతుల ఉన్న గోచి ఊడిపోయింది. తెలంగాణ మేం పెట్టిన భిక్ష అని మల్లికార్జున్‌ ఖర్గే అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్య్రం ఇచ్చారు. మరి మిమ్మల్ని ప్రధాని చేసింది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన బిక్షనా ఖర్గే అని ప్రశ్నించారు.

మిస్టర్ ఖర్గే నోరు దగ్గర పెటుకొని మాట్లాడు..నీ సొంత ఊరు కర్ణాటక లో ఇప్పటికి నీళ్లు లేవు, కరెంట్ లేదని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు. మిమ్మల్ని నమ్మి కర్ణాటక ప్రజలు ఓటేస్తే మీ జాడ,లేదు పత్తా లేదు. రిస్క్ వద్దు కారుకు ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మకండి..కేసీఆర్ ఎది చెబితే అది చేస్తారని అన్నారు మంత్రి.

ఇది కూడా చదవండి: మెట్రో రైళ్లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్

Latest News

More Articles