Friday, May 3, 2024

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ కు ఊరట.!

spot_img

రాడిసన్ హోటల్ కు సంబంధించిన డ్రగ్స్ కేసులో సినీదర్శకుడు క్రిష్ భారీ ఊరట లభించింది. విచారణలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఇటీవల గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో క్రిష్ కొకైన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రిష్, చరణ్ లకు మూత్ర పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

కోర్టు అనుమతితోనే పోలీసులు ఈ పరీక్షలు నిర్వహించారు. వీరిద్దరి నుంచి రక్తనమూనాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోవాకు చెందిన అబ్దుల్ నుంచి డ్రగ్స్ నగరంలోని సప్లయర్ రెహమాన్ చేరిందని పలు కేసుల్లో రెహమాన్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గోవా, బెంగుళూరులో వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు ర్యాడిసన్ హోటల్ సిబ్బందిపై కేసు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇంటి ఆగ్నేయ దిశలో దోషం ఉంటే ఈ సమస్యలు తప్పవు..పరిష్కారం ఇదిగో.!

Latest News

More Articles