మేడ్చల్ జిల్లా జీడమెట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో శుక్రవారం రాత్రి దారిదోపిడి జరిగింది. హెచ్ఎంటీ రోడ్లో బైక్ పై ఒంటరిగా వెళ్తున్న శ్రీకాంత్(29) అనే యువకుడిని అడ్డగించి దారిదోపిడికి పాల్పడ్డారు. శ్రీకాంత్ నిన్న రాత్రి బైక్ మీద వెళ్తుండగా.. 8 మంది దుండగులు అడ్డగించి దాడి చేశారు. అతని ఫోన్, బైక్తో పాటు రూ. 33,980లతో ఉడయించారు. భాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు.