Sunday, May 19, 2024

కొట్టుకున్న కాంగ్రెస్ లీడర్లు.. పలువురికి గాయాలు

spot_img

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పథకాల గ్యారెంటీ కార్డ్స్ తో సిడబ్ల్యూసి సభ్యుడు మోహన్ ప్రకాష్ తో కలిసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పట్టణంలో ప్రచార ర్యాలీ చేస్తుండగా తమ నేతలకు జిందాబాద్, జిందాబాద్ అంటూ పొన్నం ప్రభాకర్ వర్గీయులు, ప్రవీణ్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా రెచ్చిపోయి నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుని తోపులాటకు జరిగి స్వల్ప ఉధృక్తతకు దారితీసింది. ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

Also Read.. తెలంగాణపై మరోసారి విషం కక్కిన మోదీ.. ఘాటూగా స్పందించిన కేటీఆర్..!!

హుస్నాబాద్ శాసనసభ స్థానం నుండి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. అప్పటినుండి ఇరువురు నాయకులతో పాటు ఇరువర్గాల మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న వివాదం నేడు ఒక్కసారి భగ్గుమని బయటపడింది. ఓ వైపు ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండగానే మరో వైపు కాంగ్రెస్ నాయకులు ప్రచార ర్యాలీ నిర్వహించారు.

మరిన్ని వార్తలు..

Latest News

More Articles