Friday, May 17, 2024

పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు

spot_img

అందరూ చూస్తుండగానే ఓ బీజేపీ ఎమ్మెల్యే శివసేన పార్టీ నేతపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన పోలీసుల సమక్షంలో..అది కూడా పోలీస్ స్టేషన్‌లో జరిగింది.మహారాష్ట్రలో అధికార కూటమి నాయకుల మధ్య భూ పంచాయితి కొన్ని రోజులుగా జరుగుతుంది. సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన షిండే వర్గం నేత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఓ స్థలానికి సంబంధించి కళ్యాణ్‌ ఈస్ట్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్ , శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌ మధ్య భూ వివాదం జరుగుతుంది. దీంతో తమ మద్దతుదారులతో కలిసి ఇద్దరు నేతలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్‌, మహేశ్‌ గైక్వాడ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయనతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: రాకీ నటుడు దుర్మరణం..!

Latest News

More Articles