Thursday, May 9, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జీహెచ్‌ఎంసీ మేయర్.. రాజకీయ ప్రాధాన్యము లేదు

spot_img

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, బల్దియా జనరల్ బాడీ మీటింగ్ పై చర్చించారు. ఎన్నికల కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయాలని కోరారు. మేయర్ విజయలక్ష్మి తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాల పైన ముఖ్యమంత్రి అనుకూలంగా స్పందించారు. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తో సిఎం రేవంత్ ఫోన్లో మాట్లాడారు. పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న సీఎం ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు అని మేయర్ స్పష్టం చేసారు. దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యము లేదని, భారత రాష్ట్ర సమితి కార్యకర్తగా, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని ఇందులో ఎవరికి ఏ అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు.

Read Also.. దావత్ ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగినందుకు సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Latest News

More Articles