Friday, May 3, 2024

దావత్ ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగినందుకు సెల్ టవర్ ఎక్కిన యువకుడు

spot_img

సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నర్సింహులుకు కొంతమంది స్నేహితులున్నారు. ఆయన తన స్నేహితులకు దావత్ ఇవ్వాలనుకున్నాడు. అందులో భాగంగా తన భార్యకు తెలియకుండా ఇంట్లో నుంచి రూ. 20 వేలు తీసుకెళ్లి తన మిత్రులందరికీ దావత్ ఇచ్చాడు. ఇంట్లోని డబ్బుల గురించి ఆయన భార్య అడగడంతో విషయం చెప్పాడు. దాంతో ఆగ్రహించిన ఆమె.. నర్సింహులు మిత్రుడు మహేష్‎కి ఫోన్ చేసి డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగింది. ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దాంతో భయపడిన మహేష్.. సెల్ టవర్ ఎక్కి తోటి స్నేహితులకి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. కంగారుపడిన తోటి స్నేహితులు, పోలీసులు అక్కడకు వెళ్లి.. మహేష్‎కి నచ్చజెప్పి కిందికి దింపారు.

Latest News

More Articles