న్యూఢిల్లీ: చలిని తట్టుకునేందుకు ఇంట్లో వేసిన చలి మంటలే వారి ప్రాణాలను తీసింది. పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర ఢిల్లీలోని ఒక ఇంట్లో భార్యాభర్తలు, 7, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు మరణించారు. చలిని తట్టుకునేందుకు శనివారం రాత్రి వేళ వేసుకున్న చలి మంటల కారణంగా వారు ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు.
Also Read.. అత్తింటి వేధింపులు భరించలేక ఒకేసారి తోటికోడళ్ల ఆత్మహత్య
పశ్చిమ ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో కూడా ఇదే తరహా సంఘటన జరిగింది. నేపాల్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించారు. చలిని తట్టుకునేందుకు ఇంట్లో మంటలు రాజేయడంతో పొగ వల్ల ఊపిరాడక వారు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులు నేపాల్కు చెందిన 57 ఏళ్ల రామ్ బహదూర్, 22 ఏళ్ల అభిషేక్గా గుర్తించారు. ఈ రెండు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.