Saturday, May 4, 2024

గాలిపటం ఎగురవేస్తూ.. భవనం పైనుండి పడి యువకుడు మృతి

spot_img

మేడ్చల్ : గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవ శాత్తు భవనం పైనుండి పడి ఆకాష్ అనే 20 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రాజ శేఖర్ కుమారుడిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సహచర ఉద్యోగి కుమారుడు మృతి చెందడంతో అల్వాల్ పోలీసు స్టేషన్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read.. స్కూటీని ఢీకొట్టిన ట్రక్కు..తండ్రీకొడుకులు దుర్మరణం..తల్లి పరిస్థితి విషమం

Latest News

More Articles