Friday, May 17, 2024

ఏవోబీలో టిప్పర్‌ బోల్తాపడి ఐదుగురు కార్మికులు మృతి

spot_img

ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ లోని కటాఫ్‌ ఏరియా హంతల్‌గూడ ఘాట్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోయారు. అల్లూరి జిల్లా సరిహద్దులోని చిత్రకొండ నుంచి జడంబోకు సిమెంట్‌ లోడు, ఇనుప రాడ్లతో వెళ్తున్నారు. ప్రమాద సమయంలో టిప్పర్‌పై 16 మంది కూలీలు కూడా ఉన్నారు.  ఘాట్‌ రోడ్డు దగ్గర టిప్పర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జోడాంబో ఆసుపత్రికి తరలించారు. బాధితులు నవరంగపూర్‌ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇది కూడా చదవండి: మోడీ, రాహుల్‌ తో తెలంగాణకు మేలు జరుగదు

Latest News

More Articles