హనుమకొండ జిల్లా : ఈనెల 28న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బిఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 50 వేల భారీ మెజారిటీతో గెలుస్తానని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
Also Read.. మోడీ, రాహుల్ తో తెలంగాణకు మేలు జరుగదు
మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవ్వడం ఖాయమన్నారు. ఎన్నికలు ఉద్యమకారుడికి, ఉద్యమ ద్రోహికి మధ్య జరుగుతున్నది. ఉద్యమాన్ని అణిచి వేయడానికి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయి. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నిత్యం ప్రజలతో ఉన్నా.. ప్రతి సమస్య పట్ల అవగాహన ఉన్నదని ఆయన పేర్కొన్నారు.