Sunday, May 19, 2024

జేఈఈ మెయిన్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ. !

spot_img

దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు , ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ నేటితో గడువు ముగుస్తుంది. ఏప్రి 4-15 మధ్య ఆన్ లైన్ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి విడతకు 12.21 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 11.70 లక్షల మంది పరీక్ష రాశారు. చివరి విడత పూర్తయిన తర్వాత ఏప్రిల్ 20 ర్యాంకులు ప్రకటిస్తారు. తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ సహా కలిపి మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ఇది కూడా చదవండి: పేటీఎంకు మరో భారీ షాక్…రూ 5. 49కోట్లు జరిమానా.!

Latest News

More Articles